- జీహెచ్ఎంసీ కమిషనర్కు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెడుతుండడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పర్యావరణానికి నష్టం చేసే నిషేధిత ప్లాస్టిక్కి ఎలా అనుమతిచ్చారో చెప్పాలని కమిషనర్ లోకేశ్కుమార్, యాడ్స్ వింగ్ అడిషనల్ కమిషనర్కు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి డివిజన్ బెంచ్ నోటీసులు ఇచ్చింది. రూల్స్కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారంటూ లాయర్ కేఎస్ సాయికుమార్ ఫైల్ చేసిన పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. అక్రమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ను తొలిగించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల ఒకటికి వాయిదా వేసింది.