
- ఏడాదిలో రెండుసార్లు రేట్లు పెంచడంతో సర్కార్ కు ఫుల్ ఇన్ కమ్
- ఈనెలలో44% ఎక్కువగా రెవెన్యూ ఈసారి 2,006 కోట్ల సేల్స్..
- గతేడాది 1,397కోట్లే.. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో జోరుగా అమ్మకాలు
కరోనా టైంలో అంతటా కటకట ఉంటే రాష్ట్ర సర్కారుకు మాత్రం లిక్కర్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 44% అదనంగా రెవెన్యూ సమకూరింది. బీర్లసేల్స్దాదాపు సగానికి పడిపోగా.. ఐఎం ఎల్అమ్మకాలు కొద్దిగా పెరిగాయి. అయినా కూడా సర్కారుకు ఎక్కువ ఆదాయం సమకూ రింది. గత ఏడాది టైంలో సర్కారు రెం డు సార్లు కలిపి 40 శాతం దాకా లిక్కర్ రేట్లుపెంచింది. అందువల్లేఇన్కం బాగా పెరిగిందని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రంలో 2,211 వైన్స్లు ఉన్నాయి. లాక్ డౌన్తో మార్చి 22 నుంచి మే 5 వరకు వైన్స్లు బంద్ పెట్టారు. దాంతో ఖజానాకు రూ.4 వేల కోట్లఆదా యం నిలిచినట్టు అంచనా వేశారు. మేలో వైన్స్ ప్రారంభమయ్యాయి. లిక్కర్ రేట్లు20% పెరిగాయి. కరోనా ఎఫెక్ట్తో క్ట్ సేల్స్తగ్గి రేట్లుపెరగడంతో మేలో రూ. 1,864 కోట్లు, జూన్లో రూ.1,955 కోట్లుసమకూరింది. తర్వాత ఆదాయం పెరిగింది. గతేడాదితో పోలిస్తే జూలైలో 25% ఎక్కువగా.. ఈ నె లలో 44 % అదనంగా ఇన్కం వచ్చింది. 28 నాటికే రూ.2,006 కోట్లుసమకూరింది. గతేడాది ఆగస్టు ఇన్ కం రూ.1,397 కోట్లే. ఈ నెలలో ఇంకో మూడు రోజులు ఉండటంతో ఇంకో2 వందల కోట్ల దాకా వచ్చే చాన్స్ ఉందని చెప్తున్నారు.
బీర్ల సేల్స్ డౌన్
రాష్ట్రంలో ఐఎంఎల్(ఇండియన్మేడ్ఫారిన్ లిక్కర్) తో పోలిస్తే బీర్లే ఎక్కువగా అమ్ముడు పోయేవి. కానీ కరోనా టైం నుంచి తగ్గాయి. బీర్లరేట్లుబాగా పెరగ డమూ సేల్స్ తగ్గడానికి కారణమని అంటున్నారు. గతేడాది ఆగస్టులో 29.7లక్షల కేసుల బీర్లు అమ్మగా ఈసారి 16.8లక్షల కేసులే సేల్ అయ్యాయి. ఇదే టైమ్లో ఐఎంఎల్ అమ్మకాలు కొద్దిగా పెరిగాయి.
ఆ జిల్లాల్లో ఎక్కువగా..
రాష్ట్రంలో 19 మద్యం డిపోలు ఉన్నాయి. వాటి నుం చి ఆయా ప్రాంతాల్లోని వైన్స్ లకు లిక్కర్ సరఫరా అవుతుంది. అయితే ఏపీ సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్ లోఈసారి ఎక్కువగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఏపీలో లిక్కర్రేట్లు ఎక్కువగా ఉండటంతోపాటు లిమిటెడ్గా అమ్ముతు న్నారు. దాంతో అక్కడి వాళ్లంతా బార్డర్ దాటి వచ్చి కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వనపర్తి జిల్లాలో 119% ఎక్కువగా, వరంగల్ రూరల్ జిల్లాలో 96 % ఎక్కువగా అమ్మకాలు జరిగాయి.