
ప్రముఖ వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ద లెజెండ్’. ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జేడీ– జేర్రీ దర్శకులు. ఊర్వశి రౌటేలా హీరోయిన్. ఈ మూవీ జులై 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు ముఖ్య అతిథులుగా హాజరై మూవీ టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు. శరవణన్ మాట్లాడుతూ ‘ఒక కామన్ మేన్ లెజెండ్గా ఎలా ఎదిగాడనేది కథ. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీతో ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఉంటుందీ సినిమా’ అన్నాడు. ఈ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందంది ఊర్వశి. శరవణన్ నటన అందర్నీ సర్ప్రైజ్ చేస్తుందని చెప్పారు దర్శకులు. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ రాయ్ స్పెషల్ ఫోక్ సాంగ్లో కనిపిస్తానని చెప్పింది.