ఫిబ్రవరి 15లోగా గ్రామాల లిస్ట్ పంపాలే : కేంద్రం

ఫిబ్రవరి 15లోగా గ్రామాల లిస్ట్ పంపాలే : కేంద్రం

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల15లోగా పంచాయతీ అవార్డులకు సెలెక్ట్ చేసిన గ్రామాల లిస్టును పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏటా ఏప్రిల్​లో కేంద్రం పంచాయతీ అవార్డులను ఇస్తోంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన లిస్టులోని గ్రామాల్లో సర్వేలు చేపడుతుంది. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. 9 కేటగిరీల్లో ప్రతి మండలం నుంచి 3 గ్రామాలను అధికారులు కలెక్టర్ చైర్మన్​గా ఉండే కమిటీకి పంపాలని తెలిపింది. అనంతరం ఈ నెల 31లోగా ప్రతి జిల్లా నుంచి ఒక్కో కేటగిరీ కింద 3 గ్రామాలను అంటే మొత్తం 846 గ్రామాల జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపాలని వివరించింది. మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది.