హుజూర్ నగర్ లో ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హుజూర్ నగర్ లో ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హుజూర్ నగర్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నికకు ఇవాళ్టీతో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున పద్మావతి, బీజేపీ అభ్యర్థి రామారావు, టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి, సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్ రావు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు సర్పంచ్ ల ఫోరం కూడా సిద్దమైంది.

సాయంత్రంతో నామినేషన్లకు టైం ముగుస్తుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. అటు ప్రచారంలో దూకుడు పెంచాయి అన్ని పార్టీలు. ఓటర్లను ఆకర్షించేందుకు లోకల్ గా వరుస సమావేశాలు నిర్వహిస్తు… ప్రత్యర్థుల విమర్శల దాడి పెంచారు నేతలు. అక్టోబర్ 21న పోలింగ్ జరగనుండగా… 24న ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.

the-nomination-for-the-huzurnagar-assembly-elections-is-coming-to-an-end