డాక్టర్ కు బదులు నర్సుల డెలివరీ..శిశువు మృతి

డాక్టర్ కు బదులు నర్సుల డెలివరీ..శిశువు మృతి

షాద్ నగర్, వెలుగు: ఒక గర్బిణికి డాక్టర స్థానంలో నర్సులు డెలివరీ చేయడంతో  శిశువు మృతి చెందిన సంఘటన షాద్ నగర్ టౌన్ లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల వివరాల మేరకు కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామానికి చెందిన శైలజ(24) తొలికాన్పు కోసం దివ్వా హాస్పిటల్ లో చేరింది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో శైలజకు పురిటినొప్పులు వచ్చాయి. హాస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు శైలజకు నార్మల్ డెలివరీ చేసే ప్రయత్నంలో మగశిశువు విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న బాదిత మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని ఇరువర్గాలను విచారిస్తున్నారు.