జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ

జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ

 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.502 కోట్లు కేటాయించిన నిధులు విడుదల చేసుకోవచ్చిన ఈసీ సూచించింది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి తెలిపింది. ఈ క్రమంలోనే పలు పథకాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

గతంలో టీడీపీ ఫిర్యాదుల కారణంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా పోలింగ్‌కు ముందే డీబీటీ కింద నిధుల విడుదలను నిలిపివేశారు. అయితే మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది. ఈసీ ఆదేశాల మేరకు మే 15న ప్రభుత్వం ఆసరా, జగనన్న విద్యా దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి మొత్తం రూ.1 వెయ్యి 982 కోట్లు జమ చేసింది. ఇతర పథకాలకు కూడా డీబీటీ పద్ధతిలో వచ్చే రెండు, మూడు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.