
ఖైరతాబాద్, వెలుగు: ఈపీఎఫ్ను నిమ్స్పెన్షన్కు కన్వర్ట్ చేయాలంటూ ఆ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బుధవారం సైతం ఎస్సీ,ఎస్టీ నర్సు యూనియన్, నిమ్స్ నర్సు యూనియన్, పారామెడికల్ యూనియన్, తెలంగాణ నర్సు అసోసియేషన్ల ఆధ్వర్యంలో లంచ్ టైమ్లో నిరసన చేపట్టారు. నిమ్స్ పారా మెడికల్ యూనియన్ ప్రెసిడెంట్ శాంతి మాట్లాడుతూ.. ఈపీఎఫ్తో తాము నష్టపోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ తమ ఆవేదనను అర్థం చేసుకుని నిమ్స్ పెన్షన్ స్కీమ్ కు కన్వర్ట్ చేయాలని కోరారు.