జానపద కథల్లోనే అసలైన భారతదేశపు చరిత్ర

జానపద కథల్లోనే అసలైన భారతదేశపు చరిత్ర

 ఢిల్లీ : మనం అనుకుంటోంది, పుస్తకాల్లో చదువుతోంది అసలు చరిత్ర కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనల్ని బానిసలుగా మార్చిన వాళ్లు, బానిసత్వపు మనసున్న వాళ్లు ఆ చరిత్ర రాశారన్నారు. అసలైన భారతదేశపు చరిత్ర జానపద కథల్లో ఉందన్నారు ప్రధాని. సామన్యులే దాన్ని కొన్ని తరాలుగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూపీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ.