ఓవర్టెక్ చేయబోయి టిప్పర్ కింద పడ్డారు

ఓవర్టెక్ చేయబోయి టిప్పర్ కింద పడ్డారు

బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. టిప్పర్ని ఓవర్టెక్ చేయబోయి… అదే టిప్పర్ కింద పడి ప్రాణాలతో బయటపడ్డారు. జగిత్యాల పట్టణం ద్వారకనగర్ వీధికి చెందిన  శ్రవణ్, షోహెల్ బైక్ పై వస్తూ టిప్పర్ ని ఓవర్ టేక్ చేయబోయారు.

బైక్ పై నుంచి టిప్పర్ దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు పక్కకు ఎగిరిపడ్డారు. స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. శ్రవణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్ట్ అయ్యాయి.