పొలంలో బయటపడ్డ సొరంగ మార్గం

పొలంలో బయటపడ్డ సొరంగ మార్గం

బయ్యారం, వెలుగు: ఓ రైతుకు చెందిన పొలంలో పదడుగుల గొయ్యి ఏర్పడింది. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలంలోని కస్తూరి నగర్​లో  మంగళవారం ఏర్పడిన ఈ గొయ్యి సొరంగ మార్గం అయ్యుంటుందా అని స్థానికులు అనుకుంటున్నారు. హుస్సేన్ అనే రైతుకు చెందిన పొలంలో తెల్లవారేసరికి గొయ్యి పడిందని,  అయితే, ఇందులో రాతి కట్టడానికి సంబంధించిన ఆనవాళ్లు కన్పిస్తుండటంతో ఇది ఏదైనా సొరంగమార్గం అయ్యుంటుందా అని భావిస్తున్నారు. దీనికి దగ్గర్లోనే కాకతీయుల కాలం నాటి బయ్యారం చెరువు వుండటంతో చెరువులోకి సొరంగం అయ్యుంటుందని  అనుకుంటున్నారు.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ