బుచ్చన్నగూడెంలో 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

బుచ్చన్నగూడెంలో 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

అన్నపురెడ్డిపల్లి , వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 80 క్విటాల రేషన్​ బియ్యాన్ని   ఆదివారం తెల్లవారు జామున   ఎస్సై షాహిన , సిబ్బంది తో  కలిసి పట్టుకున్నారు . ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . కొత్తగూడెం వైపు  నుంచి కాకినాడ కు రెండు టాటా మ్యాజిక్​  వెహికల్స్​లో  రేషన్​ బియ్యాన్ని  తరలిస్తున్నారనే సమాచారం అందింది.

దీంతో  మండలంలోని బుచ్చన్నగూడెం సమీపంలో వాహనాలను పట్టుకొని, వాటిని  సీజ్​ చేసి స్టేషన్​ కు తరలించారు . ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు . ఈ దాడిలో హెడ్​ కానిస్టేబుల్​ రామారావు , జీవన్​  పాల్గొన్నారు.