యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కారులో ప్రయాణీస్తున్న ముగ్గురి నుంచి మూడున్నర కిలోల బంగారం స్వాదీనం చేసుకున్నారు. నిందితులు సుల్తానా, షరీఫ్ జావేద్ లుగా గుర్తించారు. దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో ఫైట్ దిగి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అండర్ వేర్ లో బంగారాన్ని పెట్టుకుని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వాహనాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వస్తున్న కార్లను చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద ఆపి తనిఖీ చేయగా నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా కారులో అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు.