రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది

యాదాద్రి: సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛతో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని ఆయన తెలిపారు. శాంతిభద్రతలను అద్భుతంగా కంట్రోల్ చేస్తున్న రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు దేశవ్యాప్తంగా గొప్ప పేరొచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పోలీసులకు జీతాలు పెంచామని, మహిళల భద్రత, రక్షణ కోసం 'షీ టీమ్స్'ను మొదటగా ఏర్పాటు చేసింది దేశంలో రాష్ట్ర ప్రభుత్వమే మొదటిదని ఆయన వివరించారు. పోలీసుల చర్యలతో రాష్ట్రంలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.