
దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ ఒకే రకమైన సంజ్ఞల విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈప్రత్యేక సంజ్ఞలతో దేశంలోని ఏ దివ్యాంగుడైనా…. మరో దివ్యాంగుడితో సులువుగా మాట్లాడొచ్చన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో వృద్ధులు, దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ. గత ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. తాము దివ్యంగుల పరికరాలం కోసం గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్నారు.