
- ఓయూలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉద్యోగుల నిరసన
ఓయూ, వెలుగు: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగులు.. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్కు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏటా ఇచ్చే 15 శాతం జీతాన్ని గత రెండేళ్లుగా ఆపేశారని, దీని వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. 15 శాతం వేతనాన్ని పెంచాలని కోరారు.11వ పీఆర్సీ సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా వెంకటేశ్, సూర్యచందర్, డాక్టర్ వీరేశం, సి. శ్రీనివాస్ పాల్గొన్నారు.