గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
  • గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం ఇచ్చిన గౌడ సంఘాల నేతలు

ముషీరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గౌడ సంఘాల నేతలు గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం అందజేశారు. సోమవారం రాజ్​భవన్​లో తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బాలగౌని బాలరాజ్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి నేతృత్వంలో పలువురు బీసీ ప్రతినిధులు గవర్నర్ ను కలిశారు.

ఈ సందర్భంగా బీసీ కులాలు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందుకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.