హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అధికార పార్టీ బీఆర్ఎస్ నిర్ణయించింది. మిత్రపక్షం మజ్లిస్ (MIM) చేసిన అభ్యర్థన మేరకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోంది. పార్టీలోని సీనియర్లతో చర్చించిన అనంతరం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎం అభ్యర్థికి సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 13వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.