- బిల్లులు అప్రూవ్ చేయట్లేదని సర్పంచ్ దారుణం
- రికార్డులు తగలబెడుతుండగా.. గాయాలయ్యాయన్న సర్పంచ్
- కావాలనే పెట్రోల్ పోశాడంటున్న బాధితుడు
కుభీరు/భైంసా వెలుగు: బకాయి బిల్లులపై సంతకం చేయడం లేదంటూ.. ఓ సర్పంచ్ ఉపాధి హామీ పథకం టెక్నికల్అసిస్టెంట్పై పెట్రోల్పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కుభీర్ మండలంలో రావుల రాజు ఉపాధి హామీ టెక్నికల్అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు చేయిస్తూ.. వాటికి బిల్లులు వచ్చేలా చూడటం ఆయన డ్యూటీ. మండలంలోని ఓల్డ్ సావ్లి గ్రామ సర్పంచ్ సాయినాథ్ కు రాజుకు మధ్య మస్టర్బకాయి బిల్లులకు సంబంధించి వివాదం నడుస్తోంది.
మంగళవారం రాజు మండల ఆఫీస్లో డ్యూటీలో ఉండగా.. సాయినాథ్ పెట్రోల్ డబ్బాతో అక్కడికి చేరుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సర్పంచ్ తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను రాజు పై పోసి నిప్పంటించి, పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని రాజుకు 35 శాతం గాయాలయ్యాయి. అతడిని వెంటనే భైంసాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై వారి వివరణ కోరగా.. ‘సర్పంచ్ సాయినాథ్ రోడ్డు గ్రావెల్ బిల్లుల విషయంలో పగ పెంచుకున్నాడు. కావాలనే నా పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు’ అని రాజు తెలుపగా.. ‘ మా గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో టీఏ రాజు ఇబ్బంది పెట్టాడు. ఇది విసిగిపోయి పెండింగ్ బిల్లుల ఫైల్స్ కు నిప్పంటించబోయా.. అక్కడే ఉన్న రాజు పై పెట్రోల్ పడి గాయాలయ్యాయి.. నేను కావాలని చేయలేదు’ అని సర్పంచ్ సాయినాథ్అంటున్నాడు. రాజు పై జరిగిన పెట్రోల్ దాడి విషయంపై దర్యాప్తు చేస్తున్నామని భైంసా రూరల్సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. చికిత్స పొందుతున్న రాజును జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.
