నేలకొండపల్లి, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లా వ్యవహరిస్తున్న ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని కోరుతూ కాంగ్రెస్పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు బుధవారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన పేదలు పెన్షన్ల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తుంటే ఆగస్టు 15న సర్కారు మంజూరు చేసిందన్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా ఎంపీడీవో జమలారెడ్డి తమవద్దకు పెన్షన్ల లిస్టు రాలేదని చెప్పారన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఈ నెల 17న ప్రభుత్వ ఆఫీసులకు పంపామని తెలిపారన్నారు.
తమకు మాత్రం అందలేదని చెప్పిన ఎంపీడీవో టీఆర్ఎస్ నాయకులకు మాత్రం లిస్టు అందజేశారన్నారు. ఆ లిస్టును టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో చూపుతూ తాము చెబితేనే పెన్షన్లు వచ్చాయని, తమ మాట వినకపోతే ఆపేస్తామని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లా ఎంపీడీవో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.