రేషన్ బియ్యం పట్టివేత..

రేషన్ బియ్యం పట్టివేత..

మదనాపురం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్  బియ్యాన్ని శుక్రవారం స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు. పెబ్బేరు నుంచి రాయచూరుకు మినీ వ్యాన్ లో రేషన్ బియ్యం తరలిస్తుండగా దంతనూరు స్టేజి దగ్గర వాహనాన్ని తనిఖీ చేసి 30 క్వింటాళ్ల  బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

వెహికల్​ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ వేణుగోపాల్, నందకిశోర్  రేషన్ బియ్యంగా నిర్ధారించారు. వెహికల్​ ఓనర్​ సాదిక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ నసిరుద్దీన్, కానిస్టేబుల్  ఖాజా పాల్గొన్నారు.