3 రోజులు విద్యాసంస్థలు బంద్

3 రోజులు విద్యాసంస్థలు బంద్

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈనెల 11, 12, 13 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన వర్షాలపై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో ఓయూ, జేఎన్టీయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.  ప్రభుత్వ ఆదేశాల  మేరకు 11, 12, 13 తేదీల్లో నిర్వహించాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.