- ఫ్రీగా చేయాలని సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఆస్తుల నమోదును మీ సేవ కేంద్రాల ద్వారా కూడా నిర్వహించాలని రాష్ట్ర సర్కా రు నిర్ణయించింది. ఇప్పటిదాకా ఆస్తులు నమోదు చేసుకోని వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి వివరాలను ఉచితంగా నమోదు చేయించుకో వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం టీఎస్ టీఎస్ సమన్వయంతో మీ సేవ పోర్టల్లో ప్రత్యేక ఆప్షన్ను క్రియేట్ చేయాల ని మీ సేవ డైరెక్టర్ను ఆదేశించింది. ఆస్తులు నమోదు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ల కార్యదర్శులు, కమిషనర్లు ఫీజు చెల్లించాలంది.