వెండితెరపై విష్ణు కూతుళ్లు

వెండితెరపై విష్ణు కూతుళ్లు

మోహన్ బాబు తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మితో పాటు విష్ణు, మనోజ్ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. నటులుగానే కాక ప్రొడక్షన్‌‌‌‌లోనూ కొనసాగుతున్నారు. ఇప్పుడీ కుటుంబం నుంచి మూడో తరం కూడా సినిమాల్లోకి వస్తోంది. ఇప్పటికే సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌ సినిమాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్న విష్ణు కూతుళ్లు అరియాన, వివియాన త్వరలో వెండితెరపై కూడా కనిపించబోతున్నారు. విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘జిన్నా’ చిత్రంలోని ఓ పాటను కలిసి పాడడంతో పాటు ఇద్దరూ నటించారు కూడా. ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ గొప్పతనం చాటేలా ఉండే ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.

వాళ్లు యాక్టర్స్‌‌‌‌ అవ్వాలనేది తన కోరిక అని, ఆ ప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీస్సులు, అభినందనలు కావాలని విష్ణు కోరాడు. సన్నీ లియోన్‌‌‌‌, పాయల్‌‌‌‌ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్‌‌‌‌ కథ, స్క్రీన్‌‌‌‌ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్, చోటా కె నాయుడు, ప్రేమ్ రక్షిత్ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.