దేశంలో నియంతృత్వం కొనసాగుతుంది

దేశంలో నియంతృత్వం కొనసాగుతుంది

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రస్తుతం మనుగడలో లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతుందని విమర్శించారు. ఈ సమయంలో బలమైన ప్రత్యామ్నాయం అవసరమన్నారామె. NCP అధినేత శరద్ పవార్ తో భేటి తర్వాత మమతా బెనర్జీ మాట్లాడారు. రాజకీయ పార్టీల విషయంపై మాట్లాడేందుకే శరద్ పవార్ ను కలిశానన్నారు మమతా బెనర్జీ. భావసారూప్యత కలిగిన పార్టీలు జాతీయ స్థాయిలో సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అన్నారు. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు శరద్ పవార్.