ఐపీఎల్ ​క్రికెట్ ​బెట్టింగ్ ​ముఠా అరెస్ట్

ఐపీఎల్ ​క్రికెట్ ​బెట్టింగ్ ​ముఠా అరెస్ట్
  • ఐపీఎల్ ​క్రికెట్ ​బెట్టింగ్ ​ముఠా అరెస్ట్
  • రూ.68 వేల నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం 

హనుమకొండ, వెలుగు : ఐపీఎల్​క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న గ్యాంగ్​ను వరంగల్ టాస్క్​ఫోర్స్​పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేసి వారి నుంచి రూ.68 వేల నగదు, మూడు స్మార్ట్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్ట్​కు సంబంధించిన వివరాలను టాస్క్​ ఫోర్స్​ ఏసీపీ ఎం.జితేందర్​ రెడ్డి మంగళవారం వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ పీఎస్​ పరిధి గుండ్ల సింగారానికి చెందిన లావుడ్య రాజేందర్, కొర్ర ప్రమోద్, సయ్యద్​అంకూస్, నూనావత్​ తిరుపతి, చిత్తరి కోటిలింగం ఐపీఎల్​సీజన్​స్టార్ట్ కావడంతో బెట్టింగ్​దందాకు తెరలేపారు.

ఆన్​ లైన్​లో ఓ యాప్​ డౌన్​లోడ్​చేసుకుని బెట్టింగ్​ కు పాల్పడుతుండగా.. టాస్క్​ ఫోర్స్​పోలీసులకు సమాచారం అందింది. దీంతో వరంగల్ టాస్క్​ఫోర్స్​సీఐ శ్రీనివాస్​రావు ఆధ్వర్యంలో మంగళవారం గుండ్లసింగారంలో తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్​ఆడుతున్న రాజేందర్, ప్రమోద్, సయ్యద్​ అంకూస్​ను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి, కోటిలింగం పరారీలో ఉన్నారు.