జగిత్యాల జిల్లా పురానీపేట వీధిలో ఉన్న లోకమాత పోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఇవాళ ఉదయం మూడుగంటల టైంలో తాళం పగుల గొట్టి హుండీ ఎత్తుకెళ్లాడు దొంగ. హుండీని పగులగొట్టి చెట్ల పొదల్లో పడేసి వెళ్లాడు. హుండీలో ఉన్న ఆభరణాలు, ఇతర నగలు, నగదు ఎత్తుకెళ్లాడంటున్నారు స్థానికులు. ఆలయం దగ్గరున్న సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం