బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. రోడ్ నెంబర్ 2, ప్లాట్ నెంబర్ 19 లో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే వజ్రాల అభరణాలను, నగలను చోరీ చేశారు.
చోరీ జరిగిన ఇల్లు సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డిదిగా పోలీసులు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడినట్టు చెప్పారు..
