నాగర్కర్నూల్, వెలుగు: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించే జనరల్ బ్రిడ్జి కోర్స్(మాథ్స్) పరీక్షకు ఫీజు కట్టిన విద్యార్థి కోసం శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఒక చీఫ్ సూపరింటెండ్, ఇన్విజిలేటర్, అటెండర్, బందోబస్తు డ్యూటీ కోసం కానిస్టేబుల్ను నియమించారు. ఉదయం 9 దాటినా ఫీజు కట్టిన సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి రాకపోవడంతో ఐదుగురు సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది.
ఇంటర్ అనంతరం జనరల్ బ్రిడ్జి కోర్స్(మ్యాథ్స్) పరీక్ష రాయడానికి కమ్మరి వరుణ్ సందేశ్ ఫీజు కట్టాడు. జిల్లా మొత్తంలో ఒక్కడే ఫీజు కట్టగా, ఈ ఒక్కడి కోసం జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా వృత్తి విద్యాధికారి వెంకటరమణతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, అటెండర్, బందోబస్తు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ నుంచి క్వశ్చన్ పేపర్ తెచ్చి రెడీగా కూర్చున్నారు. ఫీజు కట్టిన విద్యార్థి గైర్హాజరు కావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
