- మూర్ఛ వ్యాధితో ఒకరి మృతి
- ఫినాయిల్ తాగి మరొకరు..
నిజామాబాద్ క్రైం, వెలుగు : నిజామాబాద్ జిల్లాలో కల్లు దొరకట్లేదని కొందరు ఆగమాగం అవుతున్నారు. వారి ప్రవర్తన వింతగా ఉంటుంది. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మూర్ఛ వ్యాధితో శనివారం మృతిచెందాడు. అయితే వారం రోజులుగా కల్లు దొరకకపోవడంతోనే అతనికి మూర్ఛ వచ్చిందని కుటుంబీకులు చెబుతున్నారు. నిజామాబాద్లోని ముదిరాజ్ వీధికి చెందిన భువనగిరి భూషణ్ (45)కు కృత్రిమ కల్లు అలవాటు ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో వారం రోజులుగా జిల్లా కేంద్రంలో కల్లు దుకాణాలు బంద్ఉన్నాయి. దీంతో మూడు రోజులుగా అతను కల్లు కావాలని పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి మూర్ఛ వచ్చి పడిపోయాడు. వెంటనే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
కల్లు దొరకలేదని ఫినాయిల్ తాగింది
కల్లు దొరకడం లేదని నిజామాబాద్లోని సాయినగర్కాలనీకి చెందిన శకుంతల(42) శుక్రవారం రాత్రి ఫినాయిల్తాగింది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది.