ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 22) ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీని తొలుత బౌలింగ్కు ఆహ్వానించాడు.
అతిథ్య హైదరాబాద్ సేమ్ టీమ్తో బరిలోకి దిగగా.. ఆర్సీబీ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా పంజాబ్తో మ్యాచుకు దూరమైన ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఈ మ్యాచులో తిరిగివచ్చాడు. గాయం కారణంగా జాకబ్ బెథేల్ జట్టుకు దూరమయ్యాడు.
పాయింట్ల పట్టికలో ఫస్ట్, థర్డ్ ప్లేసుల్లో ఉన్న ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో టాప్ 2లో చోటు దక్కించుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్
