న్యాయ వ్యవస్థలోనే సామాజిక న్యాయం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

న్యాయ వ్యవస్థలోనే సామాజిక న్యాయం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఉన్నత న్యాయస్థానాల్లో 79% అగ్రవర్ణాలకే రిజర్వు చేయబడిందని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థలోనే సామాజిక న్యాయం లేదు.. బయట ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. రాజ్యసభలో కూడా ఇలాగే ఉందని, అందుకే జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. దీంతో పాటు ఓ నేషనల్ న్యూస్ పేపర్ లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ఓ ఆర్టికల్ ను ఆయన షేర్ చేశారు.

కేంద్ర పార్లమెంటరీ కమిటీకి న్యాయ మంత్రిత్వ శాఖ కొన్ని కీలక గణాంకాలను వెల్లడించింది. గత ఐదేళ్లుగా అగ్రవర్ణాలకు చెందిన వారికే రిజర్వేషన్లు చేయబడుతున్నాయని, దేశంలోని 25 హైకోర్టుల్లో నియామకాల్లో 79శాతం అగ్రవర్ణాల వారే కావడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోందని చెప్పింది. సీట్ల నియామకాలలో 11శాతం కంటే తక్కువున్న దేశ జనాభాలో 35శాతం కంటే ఎక్కువున్న ఓబీసీల నియామకాలలో వివక్ష చూపిస్తోందని తెలిపింది. ఈ వివక్షకు సంబంధించిన మరో అంశమేమిటంటే.. 2018 నుండి హైకోర్టులకు నియమించిన మొత్తం 537 మంది న్యాయమూర్తులలో మైనార్టీ వర్గం నుండి కేవలం 2.6శాతం మంది మాత్రమే నియమితులవ్వడం గమనార్హం అని వెల్లడించింది.