ఆగస్టు 19, 20 తేదీల్లో ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

ఆగస్టు 19, 20 తేదీల్లో ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైద‌రాబాద్, వెలుగు:  మంజీరా వాటర్ సప్లయ్ ఫేజ్–2లో పైప్ లైన్ పనుల కారణంగా ఈ నెల 19,20వ తేదీల్లో రెండ్రోజుల పాటు సిటీలో తాగునీటి సప్లయ్ ఉండదని వాటర్ బోర్డు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు సంగారెడ్డి జిల్లా కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు, పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పైప్ లైన్ కు జంక్షన్ పనులు జరగనున్నాయి. 

దీంతో సుమారు 30 గంటల పాటు ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్ తో పాటు ఓ అండ్ ఎం డివిజన్ నం.8 పరిధిలోని టేక్ ఆఫ్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లకు నీటి సప్లయ్ లో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.