ఏటీఎంలో చోరి చేయబోయి ప్రాణం కోల్పోయాడు

ఏటీఎంలో చోరి చేయబోయి ప్రాణం కోల్పోయాడు

దొంగతనం చేయబోయి తప్పించుకునే ప్రయత్నంలో ఓ దొంగ తన ప్రాణాల్ని కోల్పోయాడు. ఈ ఘటన నల్గోండ జిల్లా చండూర్ మం. గట్టుప్పల్ లో జరిగింది. గట్టుప్పల్ లోని ఓ ఏటీఎమ్ లో  చోరికి యత్నిస్తుండగా ఆ దొంగను స్థానిక యువకులు గమనించారు. దీంతో అప్రమత్తమైన దొంగ వారి నుంచి తప్పించుకోవడానికి,  బైక్ పై పరారీ అవుతున్న క్రమంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆ దొంగను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు.