- స్క్రూడ్రైవర్తో అద్దం తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు
- మెదక్ జిల్లా చేగుంటలో ఘటన
మెదక్ (చేగుంట), వెలుగు : మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో శుక్రవారం కారులో నుంచి రూ.5 లక్షలు చోరీ చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్మండలం మహ్మద్ షాపూర్కు చెందిన చంద్రారెడ్డి కూతురు మర్కూక్లో కొత్తగా ఇల్లు కట్టుకుంటోంది. నిర్మాణానికి డబ్బులు అవసరముండగా చంద్రారెడ్డి శుక్రవారం చేగుంటలోని యూనియన్బ్యాంక్ నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలకు చెందిన బిల్డర్విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చాడు. అతను ఆ డబ్బులు కారు డ్యాష్బోర్డులో పెట్టాడు.
తర్వాత సీతారాం నగర్ కాలనీ లోని ఓ స్నేహితుడి ఇంటి ముందు కారు ఆపి టీ తాగేందుకు ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో బైక్మీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు స్క్రూ డ్రైవర్ తో కారు అద్దం తొలగించి డ్యాష్బోర్డులో ఉన్న రూ.5 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.