దొంగలు హల్చల్.. వరుసగా ఐదు ఇళ్లల్లో చోరీ

దొంగలు హల్చల్.. వరుసగా ఐదు  ఇళ్లల్లో చోరీ

 

ఇంటికి తాళాలు వేసి ఉంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. కన్నుపడితే చాలు లూటీ చేసేస్తున్నారు.  తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు.  వరుసగా ఐదు  ఇండ్లల్లో చొరబడ్డారు. స్థానికంగా ఈ ఘటన భయాదోంళనకు గురిచేసింది.  గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలోని ఇండ్లల్లో చోరీకి దింగిన దొంగలు సుమారు 2 లక్షల నగదు, 2  తులల బంగారం.2 ఉంగరాలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.  ఈ మేరకు గూడూరు పోలీసలుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.  వరుస ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడటంతో బొల్లెపల్లి గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.