మహిళ మెడలో గోల్డ్ చైన్ స్నాచింగ్

మహిళ మెడలో గోల్డ్ చైన్ స్నాచింగ్

గండిపేట్,వెలుగు: మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ ను దొంగలు లాక్కొని పరారైన ఘటన రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బుద్వేల్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ మహిళ ఆదివారం సాయంత్రం ఆటోలో వచ్చి చౌరస్తాలో దిగి నడుచుకుంటూ వెళ్తుంది. 

ఇద్దరు గుర్తు తెలియని దుండుగులు ఆమెను వెనకాల ఫాలో అయి మెడలోంచి 3 తులాల గోల్డ్ చైన్ తెంపుతుండగా.. అప్రమత్తమై పెనుగులాడడంతో మహిళ కిందపడిపోగా తీవ్ర గాయాలు అయ్యాయి. దొంగా.. దొంగా అని ఆమె అరవడంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా  చైన్‌‌‌‌‌‌‌‌ స్నాచర్లు తప్పించుకోని పారిపోయారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు  కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.