పోలీసు స్టేషన్లో దొంగలు పడ్డారు..  

పోలీసు స్టేషన్లో దొంగలు పడ్డారు..  
  • పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ లాకర్ రూ.8 లక్షలు మాయం

ఏలూరు: అవును.. మీరు చదివింది నిజమే. పోలీసు స్టేషన్లోనే దొంగలు పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని అనుమానించి రహస్యంగా ఉంచి విచారణ జరపగా.. ఇంటి దొంగెవరో తేలలేదు. దీంతో బయట పెట్టక తప్పలేదని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్లో జరిగిన ఈ చోరీ ఘటన సంచలనం రేపుతోంది. మొన్న మూడు రోజులుగా బ్యాంకులు సెలవు కావడంతో మద్యం దుకాణాల ద్వారా చేసిన అమ్మకం సొమ్మును పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు దుకాణ సిబ్బంది. బ్యాంకులు తెరిచాక పోలీస్‌స్టేషన్‌లో తాము భద్రపరచిన డబ్బు కోసం వైన్ షాపుల సిబ్బంది రాగా... లాకర్ లో పెట్టిన నగదు కనిపించలేదు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్లోని డబ్బు మాయమైపోయిన ఘటనపై విచారణ చేపట్టారు.