150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కావాలనే సీఎం టెలిమెట్రీ ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 పైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు లేఖ రాశామన్నారు. ఆయన తక్షణమే స్పందించి త్వరలోనే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీని ఆదేశించారని తెలిపారు.
ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. దీన్ని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని తెలిపారు బండి సంజయ్.