హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీఎస్, డీజీపీతో సహా 11 మంది అధికారులను ఆయా బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నా రని ఆధారాలు సైతం సమర్పించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాతంగా జరగాలంటే వీళ్లందరిని బదిలీ చేయాలని కోరారు. ఐపీఎస్లు న్యాయ వ్యవస్థను తారుమారు చేస్తూ.. ఐఏఎస్లు అడ్మినిష్ట్రేషన్ రూల్స్ బ్రేక్ చేస్తూ కేసీఆర్ సర్కార్కు కొమ్ము కాస్తున్నారని ఆరోపిం చారు.
ఒక శాఖలోనే ఎక్కువ రోజులు పనిచేస్తూ బీఆర్ఎస్కు వత్తాసు పలుకుతు న్నారని విమర్శించారు. స్పెషల్ సీఎస్లు అరవింద్ కుమార్, రజత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, డీఎం రమేశ్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్ రావులను బదిలీ చేయాలని జడ్సన్ కోరారు.