హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

హాష్ ఆయిల్(గంజాయి) ను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని బాలానగర్ డీసీపీ తెలిపారు. వారివద్ద నుంచి 2 లీటర్ల హాష్ ఆయిల్, ఒక ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు, రూ. 12వందలు, సిరంజీలలను అదుపులోకి తీసుకున్నారు.

వాటి విలువ దాదాపు రూ. 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు పాత నేరస్తులని.. ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర వీరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.