మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలు

మొదటి కాన్పులోనే  ముగ్గురు పిల్లలు

గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. గూడూరు మండలం రాముల్ తండాకు చెందిన బానోతు పృథ్విరాజ్​కు, చెన్నరావుపేట పదహారు చింతల్ తండాకు చెందిన దివ్యతో ఏడాది కింద పెండ్లయింది. నిండు గర్భిణి అయిన దివ్యను కుటుంబ సభ్యులు వరంగల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

డాక్టర్లు ఈ నెల 3న నార్మల్ డెలివరీ చేయగా మొదట బాబు పుట్టాడు. తర్వాత సిజేరియన్ ​చేయగా దివ్య ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారు. డిశ్చార్జ్​ అయ్యాక పిల్లలను తండాకు తీసుకెళ్లగా, ఊళ్లోని జనమంతా వచ్చి చూసి వెళ్తున్నారు.