వేములవాడలో కాంగ్రెస్‌‌‌‌ లోకి ముగ్గురు కౌన్సిలర్లు

వేములవాడలో కాంగ్రెస్‌‌‌‌ లోకి ముగ్గురు కౌన్సిలర్లు

వేములవాడ, వెలుగు: వేములవాడలో జంపింగ్‌‌‌‌లు స్టార్ట్ అయ్యాయి. గెలిచినవారిలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన ఐదుగురిలో నరాల శేఖర్‌‌‌‌‌‌‌‌, ఇండిపెండెంట్లు కుమ్మరి శిరీష-, ఎలా శ్రీనివాస్  కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. వారికి విప్‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్​ కౌన్సిలర్ల సంఖ్య 16 స్థానాలకు చేరుకుంది. వారంతా ఒకే క్యాంపులో ఉండిపోయారు. 

చైర్మన్​, వైస్​ చైర్మన్​ ఎన్నిక రోజు వేములవాడకు చేరుకుంటారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు రోజురోజుకు విశ్వాసం పెరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.