టైరు పేలి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

టైరు పేలి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై.. కారు  బైకును ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న కారు ఆళ్లగడ్డ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో.. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.  ఆ తర్వాత పల్టీలు కొడుతూ మరోవైపు వెళ్తున్న మోటర్ సైకిల్ ని ఢీకొట్టింది.  ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తల కోసం

సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది..

యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే