ప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ప్రజ్ఞాపూర్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.