
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు, వారి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరొకరికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన ఇద్దరికి(మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు), గంభీరావుపేట మండలం చెందిన వ్యక్తికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా.. ముగ్గురు వ్యక్తులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన మరో మూడు కేసులుతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 10 కి చేరింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్కు పంపించారు.