- గవర్నర్కు నెగటివ్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజ్భవన్లోని మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాజ్భవన్లో కేసుల సంఖ్య 10కి చేరింది. గవర్నర్ లాల్జీ తాండన్కు కూడా టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. రాజ్భవన్లో ఉంటున్న 190 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటి వరకు 10 మందికి పాజిటివ్ వచ్చింది. వాళ్లంతా మూడు కుటుంబాలకు చెందిన వారని అన్నారు. మరో 180 మందికి నెగటివ్ వచ్చింది. రాజ్భవన్ పరిసరాలను అధికారులు శానటైజ్ చేశారు. అంతే కాకుండా వైరస్ సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 7645 కేసులు నమోదు అయ్యాయి.