వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 16న) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు మహిళలు మృతిచెందారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పరిగి పరిధిలోని శ్రీ వెంటేశ్వర బాయిలర్ సమీపం నుంచి ప్రయాణికులు ఆటోలో వెళ్తున్నారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపైకి ఆటో రాగానే వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో ముగ్గురు చనిపోయారు. 

చనిపోయిన వారిలో పీర్లగుట్ట యమ్లీ బాయ్ (58), గుండాలకు చెందిన శశికళ (37) కొత్తపల్లికి చెందిన అంజమ్మ (39) అనే మహిళ ఉన్నారు. మరో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులను విచారిస్తున్నారు.