కానిస్టేబుల్ పై దాడి.. ముగ్గురు యువకులు అరెస్ట్

కానిస్టేబుల్ పై దాడి.. ముగ్గురు యువకులు అరెస్ట్

ఎల్బీ నగర్లో కానిస్టేబుల్ పై దాడి చేసిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. వనస్థలిపురంలో బార్ వద్ద అర్థరాత్రి గొడవజరుగుతుందన్న సమాచారంతో కానిస్టేబుల్ శివకృష్ణ, హోంగార్డ్ సురేశ్  అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవ పడుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా వారు పోలీసులపై దాడి చేశారు. కానిస్టేబుల్ శివకృష్ణ ఫిర్యాదుతో నగేశ్, నరేశ్, మహేశ్ అనే ముగ్గురిని  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.