- రాజేంద్రనగర్ అభ్యర్థిగా రవి యాదవ్
- ప్రకటించిన మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ బెల్లి రవియాదవ్ను ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ప్రకటించారు. రవి యాదవ్ గతంలో లంగర్హౌజ్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పని చేశారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేసిన రహమత్ అలీబేగ్, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ చేతిలో ఓడిపోయాడు.
ఈ నియోజకవర్గంలో 5.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే రాజేంద్రనగర్పై మజ్లిస్ ఫోకస్ పెట్టింది. హిందువుల ఓట్లు కూడా పడ్తాయని మజ్లిస్ భావిస్తున్నది. పోటీ చేయాలనుకుంటున్న 9 నియోజకవర్గాల్లో ఎనిమిదింటిలో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. బహదూర్పురా ఇంకా పెండింగ్లో ఉంది. అక్బరుద్దీన్ ఒవైసీ కొడుకు నూరుద్దీన్ ఒవైసీని బహదూర్పురా నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.